సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జనవరి 10: నేతన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న నేతన్న బీమా పథకానికి సంబంధించి సిరిసిల్లలో రెండు కుటుంబాలకు తొలిసారిగా బీమా సొమ్ము చెక్కులు అందాయి. సిరిసిల్లకు చెందిన ఇద్దరు నేత కార్మికులు కోడం శ్రీశైలం, నల్ల సూర్యనారాయణ ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులకు నేతన్న బీమా పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.5 లక్షలు మంజూరయ్యాయి.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సెస్ వినియోగదారుల కృతజ్ఞత సభలో ఈ చెక్కులను మంత్రి కేటీఆర్ అందజేశారు. కోడం శ్రీశైలం భార్య కోడం వనితతో పాటు నల్ల సత్యనారాయణ తల్లి నల్ల నిర్మల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చెక్కులను స్వీకరించారు.