హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ (సివిల్ సర్వీసెస్) పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు అభినందించారు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 40 మంది మంచి ర్యాంకులు సాధించడం పట్ల ఆయన ట్విట్టర్లో హర్షం వ్యక్తంచేశారు.