హైదరాబాద్, డిసెంబర్7 (నమస్తే తెలంగాణ): ఇటీవలే కేంద్ర బాల సాహిత్య పురసారం అందుకొన్న సిరిసిల్లకు చెందిన కవి, డాక్టర్ పత్తిపాక మోహన్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యేకంగా సతరించారు. సాహిత్య ఆకాడమీ పురసారం సిరిసిల్ల బిడ్డకు రావడం సంతోషకరమైన విషయమని, మానేరుకు గర్వకారణమని మంత్రి కొనియాడారు.
బాల సాహిత్య పురసారం పొందిన ‘బాలల తాత బాపూజీ’ పుస్తకం ద్వారా బాలలకు మహాత్మా గాంధీని పరిచయం చేయడం అభినందనీయమన్నారు. వచ్చే ఫిబ్రవరిలో సిరిసిల్లలో మానేరు రచయితల సంఘం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించనున్న పత్తిపాక మోహన్ బాల సాహిత్య రజతోత్సవం- సాహిత్య సదస్సుకు మంత్రి కేటీఆర్ను ఈ సందర్భంగా పత్తిపాక ఆహ్వానించగా, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం పత్తిపాక మోహన్, చందన దంపతులు తమ రచనలను మంత్రి కేటీఆర్కు అందించారు.