హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, మే 5 (నమస్తే తెలంగాణ)/బోయినపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన జవాన్ పబ్బళ్ల అనిల్ పార్థివదేహానికి ఆర్మీ ఉన్నతాధికారులు నివాళులర్పించారు. గురువారం జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అనిల్ మరణించిన విషయం తె ల్సిందే. శుక్రవారం ఆయన భౌతికకాయం హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ఫోర్స్కు చేరుకోగా తెలంగాణ, ఏపీ సబ్ ఏరియా మేజర్ జనరల్ రాకేశ్ మనోచా నివాళులర్పించారు.
అనిల్ మృతి బాధాకరం: మంత్రి కేటీఆర్
జవాన్ అనిల్ మృతిపట్ల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం లో యువ జవాన్ను కోల్పోవడం బాధాకరమ ని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చా రు.జవాన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవిశంకర్ పరామర్శించారు. శనివారం మల్కాపూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.