హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎంపిక చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వెల్లడించారు.
మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పరిధిలో తొలి విడత సమన్వయకర్తలను ఆయన నియమించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, పార్టీ అధినాయకత్వం ఇచ్చే మార్గదర్శకాలు, దిశానిర్దేశాన్ని ఎప్పటికపుపడు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు తెలిపి నిత్యం ముందుకు సాగడమే లక్ష్యంగా సమన్వయకర్తలు పనిచేస్తారని పార్టీ తెలిపింది.