హైదరాబాద్ : వరంగల్కు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు రామా శ్రీనివాస్(Rama Srinivas) అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడ యశోద దవాఖానలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి హుటాహుటిన సోమాజిగూడకు బయలు దేరారు. యశోద దవాఖానకు చేరుకొని రామా శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు(tributes) అర్పించారు. కాగా, శ్రీనివాస్ మోక్షారామా ఫౌండేషన్ పేరుతో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మ ఒడి పేరుతో అనాథలు, వృద్ధులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు స్మరించుకున్నారు.