KTR | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): అర్ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. రేవంత్రెడ్డి క్యాబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ పాలసీతో మైనార్టీల ఆస్తులను, హకులను హరిస్తుంటే, రేవంత్రెడ్డి తెలంగాణలో అదే పద్ధతిలో మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకొంటున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు మద్దతు పలికినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. శనివారం బీఅర్ఎస్ మైనార్టీ విభా గం సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ 1953 తర్వాత తొలిసారి రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం దకలేదని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరూ గెలవలేదన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకోజాలదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు రేవంత్ ప్రభుత్వం ఏమాత్రం తీసిపోలేదని ధ్వజమెత్తారు. మైనార్టీలను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తుందని విషయం మైనార్టీలు అర్థం చేసుకోవాలని సూచించారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుం డా చేయటంలో బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడుతున్నదని ఆరోపించారు. ఎన్నికలముందు మైనార్టీ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు షబ్బీర్ అలీని వాడుకున్నదని, అధికారంలోకి వచ్చాక ఆయనకు సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. ఈ చర్య మైనార్టీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమేనని అన్నారు.
రేవంత్రెడ్డి 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒకరోజు కూడా మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించలేదని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 12 ప్రధాన హామీలను వెంటనే అమలు చేయాలని, ముస్లిం కోటాను పెంచడం, మైనార్టీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం వంటి అంశాలపై తక్షణమే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు చెలరేగుతాయని తాము హెచ్చరించామని, ఇప్పుడు రేవంత్రెడ్డి హయాంలో సంగారెడ్డి, నల్లగొండ తదితర ప్రాంతాల్లో జనవరి 22న మత ఘర్షణలు జరిగాయని తెలిపారు. ఘర్షణలను ఆపకుండా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. హోంశాఖ నిర్వహిస్తున్న రేవంత్రెడ్డి మత ఘర్షణలకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. మత ఘర్షణల అనంతరం కూడా సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం, జిల్లా పోలీసులతో కనీసం మాట్లాడకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధా న్యం దేశంలో మరెవ్వరూ ఇవ్వలేదని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. మైనార్టీలందరూ బీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీలంతా ఐక్యంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి మైనార్టీల్లో చైతన్యం తీసుకొద్దామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, అసెంబ్లీ మాజీ స్పీకర్లు ఎస్ .మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సలీం, మైనార్టీ నాయకులు అక్బర్ హుస్సేన్, బాబా ఫసియొద్దీన్, ముజీబ్, ఇబ్రహీం, జహంగీర్, బాక్రీ, అలీ తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వం హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం ఎంతగానో ప్రయత్నం చేశామని కేటీఆర్ తెలిపారు. విసృ్తత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని గుర్తుచేశారు. విద్యారంగంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మైనార్టీలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ విధానాల పట్ల నమ్మకం ఉంచి గత ఎన్నికల్లో మైనార్టీలు మద్దతు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి లబ్ధి చేకూర్చేలా రానున్న లోక్సభ ఎన్నికల్లో బలహీన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. గత లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే పనిచేసిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేయబోతున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని మైనార్టీలు గుర్తించాలని కోరారు.