సుల్తానాబాద్, మార్చి 23 : వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు పరిహారం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు గురువారం ఆయన చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకాలు చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. కాల్వశ్రీరాంపూర్లోనూ బీఆర్ఎస్ నాయకులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.