నందికొండ, మార్చి 23 : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యుడు డాక్టర్ ఆర్ఎస్ సాంఖున ఆధ్వర్యంలో ఈఈ శివశంకరయ్య, రఘునాథ్రావుతో కూడిన బృందం రెండో రోజైన శనివారం నాగార్జున సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ను సందర్శించింది. గతంలో తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు డ్యామ్ నిర్వహణ పనులు చేపట్టేవారు. ఇప్పుడు డ్యామ్పైన ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుకు చేపట్టాల్సిన మరమ్మతు పనులు పూర్తి చేసే విషయాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డ్యామ్ నిర్వహణ పనులను తెలంగాణ అధికారులకు అప్పగించడానికి, డ్యామ్పైన ఏయే పనులు ఎక్కడెక్కడ చేపట్టాల్సి ఉన్నది అనే అంశాలను కేఆర్ఎంబీ బృందం పరిశీలించింది. అనంతరం ఎన్ఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.