హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జలసౌధలో సోమవారం జరగాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. వేసవి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రతిపాదించింది. ఏపీ తన కేటాయింపులకు మించి జలాలను ఇప్పటికే వినియోగించుకొన్నదని, ఏపీని నిలువరించాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది.
ఈ అంశాలపై చర్చించేందుకు సోమవారం సమావేశం కావాలని కేఆర్ఎంబీ ఇరు రాష్ర్టాలకూ సమాచారం అందించింది. సమావేశానికి హాజరుకావడం వీలుకాదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమాచారం అందించడంతో సమావేశం వాయిదా పడింది. ఏపీ ఇప్పటికే ఎకువ నీటిని వినియోగించుకొందని, తదుపరి నీటి వినియోగానికి అనుమతి ఇవ్వొద్దని కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కలిసి కోరారు.