హైదరాబాద్ : ఈ నెల 23న చెన్నైలో తాగునీటి కమిటీ సమావేశం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో జరుగనున్నది. వర్చువల్ విధానంలో కమిటీ ఆరో సమావేశం జరుగనుండగా.. సమావేశంలో ఐదు రాష్ట్రాల అధికారులు పాల్గొనున్నారు. కేఆర్ఎంబీ ప్రతినిధులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తెలుగుగంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల తాగునీటి సరఫరా అంశంపై కేఆర్ఎంబీ ప్రతినిధులు, ఐదు రాష్ట్రాల అధికారులు చర్చించనున్నారు.