హైదరాబాద్, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ): బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, విద్యా, ఉద్యోగాలపై ఉన్న క్రీమిలేయర్ నిబంధన తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
గురువారం చెన్నైలో నిర్వహించిన అఖిల భారత ఓబీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగులు ఐకమత్యంతో ఉద్యమిస్తే సమస్యలు పరిషారమవుతాయని సూచించారు. జనాభా గణనలో కుల గణన చేపట్టాలని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని కృష్ణయ్య కోరారు.