హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వివాదం ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నది. ఇరురాష్ర్టాలు అంశాల వారీగా ఇప్పటికే వాదనలు వినిపించాయి. ఏపీ దాఖలు చేసిన రిజాయిండర్కు తెలంగాణ దాఖలు చేసిన సర్రిజాయిండర్పై బుధవారం ఢిల్లీలో ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. దీనిపై ఏపీ సుదీర్ఘమైన సమాధానాలు ఇస్తుండటంతో పాటు, అదనంగా మరికొన్ని నూతన అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ఏపీ వాదనలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో విచారణ వాయిదా పడింది.