హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): కృష్ణా జల వివాద ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ నేటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో కొనసాగనున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర నేతృత్వంలో గత నెల న్యూఢిల్లీలో విచారణ కొనసాగింది. ఇరు రాష్ర్టాలు అంశాల వారీగా వాదనలు వినిపించాయి. ఈ సందర్భంగా ఏపీ దాఖలు చేసిన రిజాయిండర్కు రెండు వారాల్లో కౌంటర్ రిజాయిండర్ వేయాలని తెలంగాణకు ట్రిబ్యునల్ చైర్మన్ సూచించడంతో పాటు విచారణను మే 18కి వాయిదా వేశారు.