హైదరాబాద్: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశమవనుంది. జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎజెండా అంశాలను ఇరు రాష్ట్రాలకు అందజేశారు. బోర్డు వార్షిక బడ్జెట్తోపాటు పరిపాలన, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి విధివిధానాలు, 2022-23 సంబంధించి నీటి వాటా ఒప్పందం అంశాన్ని పొందుపరిచారు.
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక పంపకాలు జరపాలని రాష్ట్రం చేసిన విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా నిధుల కేటాయింపు, ఆర్డీఎస్, శ్రీశైలం, నాగార్జున సాగర్లో 15 ఔట్లెట్లను బోర్డుకు అప్పగించడంపై చర్చించనున్నారు.