హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వచ్చే నెల 5న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అంశంపై త్రిసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో తాజాగా తాగు, సాగునీటి అవసరాల కోసం నీటి ఇండెంట్లను ఫైనల్ చేయాల్సి ఉన్నది.