హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని కృష్ణాబోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి బోర్డు లేఖ రాసింది.
తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అచ్చంపేట లిఫ్ట్ను నిర్మిస్తున్నదంటూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో లేఖ రాసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చిందని వెల్లడించింది.