Kranthi Kiran | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. తెలంగాణ మీద ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ నాయకుడు క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో క్రాంతి కిరణ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం త్యాగాలతో వచ్చింది.. ఆ త్యాగాలు రేవంత్కు తెలియవు అని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారిపై రేవంత్ కక్ష కట్టారు. తమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తూ ఉల్టా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎమర్జెన్సీని కాంగ్రెస్ పాలన తలపిస్తోందన్నారు.
జర్నలిస్టులు ప్రజా సమస్యలపైనే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? సిద్దిపేట జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్త చంపుతానని బెదిరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. మేధావులు ఈ అరాచక విధానాలపై స్పందించాలి. కేసీఆర్ హయంలో ఇలాంటివి జరగలేదు అని క్రాంతి కిరణ్ గుర్తు చేశారు.