కవాడిగూడ, జనవరి 28: కుర్తాళం శ్రీసిద్ధేశ్వర పీఠం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి ప్రత్యంగిర మహాయాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో స్వామి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, రమ్యానంద భారతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాగానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి మాట్లాడుతూ.. కోటి ప్రత్యంగిర మహాయాగం వల్ల సమాజంలోని అరిష్టాలు తొలగిపోయి ప్రజలకు శుభం కలుగుతుందని చెప్పారు. దేశంలో తొలిసారిగా 25 వేల కిలోల ఎండు మిరపకాయలతో ఈ యాగం చేయడం అమ్మవారి కృప అని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కుర్తాళం శ్రీసిద్ధేశ్వర పీఠం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నగర నడిబొడ్డున ఈ యాగం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.