హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అబద్ధాపు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని, రాబోయే రోజుల్లో బీజేపీకి పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా శాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అమరవీరుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్ష సంకల్పంతో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమైందన్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతున్న ఘనత కేసీఆర్దేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.