పెద్దపల్లి: బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్లోని ఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ-ఫారం అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న ఆయన పెద్దపల్లి పార్లమెంటు గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.