హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలనలో సామాన్యుడి బ తుకు భారంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చూస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ నెల 10న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘అచ్చే దిన్’ వస్తాయని చెప్పి సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం, సామాన్యులపై మాత్రం పన్నుల భారం వేస్తున్నదని చెప్పారు.