Konda Surekha | రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీలు కట్టారు. కాగా, మంత్రి కొండా సురేఖ సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టారు. అలాగే సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టారు. పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను అని రాఖీ కట్టిన వెంటనే కొండా సురేఖ వెనుదిరిగి వెళ్లిపోయారు. సీఎం రేవంత్పై మంత్రి సురేఖ కూతురు సుస్మిత చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రిని తొలగించాలని కాంగ్రెస్ నాయకులు హైకమాండ్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సురేఖ సీఎంను కలువడం ప్రాధాన్యం సంతరించకుంది.
రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
రాఖీ కట్టి రేవంత్ రెడ్డి నివాసం నుండి వెంటనే వెనుదిరిగిన కొండా సురేఖ https://t.co/NhWIDe9Uc6 pic.twitter.com/BPhlZAbm32
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026