కుమ్రంభీం వర్ధంతిని ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లో శనివారం అధికారికంగా నిర్వహించారు. భీం వారసులు, వంశీయులు తమ సంస్కృతి, సంప్రదాయల నడుమ పూజా కార్యక్రమం నిర్వహించి అమరవీరుల జెండాలను ఎగురవేశారు.
భీం మనువడు కుమ్రం సోనేరావ్, కలెక్టర్ హేమంత్ సహదేవ్రావు, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయి, ఎస్పీ సురేశ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు భీం విగ్రహం, సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజా దర్బార్ నిర్వహించలేదు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)