Jupally Krishna Rao | కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావుపై మహిళలు తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మంత్రిని మహిళలు నిలదీశారు.
హామీలు, పథకాలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఏది అందలేదు. మిమ్మల్ని నమ్మి మోసపోయం, మళ్లీ ఇప్పుడు ఓటు వేసి మేము మోసపోదలుచుకోలేదు అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావును మహిళలు నిలదీశారు. ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ మాత్రమే అమలైందని, మిగతా ఐదు గ్యారెంటీలో ఎప్పటిలోగా అమలు చేస్తారని మంత్రిని మహిళలు ప్రశ్నించారు. మహిళలు నిలదీయడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇట్ల గాయిగాయి పెడితే ఏం అర్థమైతలేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదని మంత్రి జూపల్లి ఆగ్రహించారు.
మంత్రి జూపల్లిపై తిరగబడ్డ మహిళలు
కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూపల్లిని హామీల గురించి నిలదీసిన మహిళలు
హామీలు, పథకాలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఏది అందలేదు.. మిమ్మల్ని నమ్మి మోసపోయం, మళ్లీ ఇప్పుడు ఓటు వేసి మేము మోసపోదలుచుకోలేదు అంటూ మంత్రి జూపల్లి… pic.twitter.com/jAP3byL4sG
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2024