హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సభలు విజయవంతం కావడంతో విపక్షాలు విలవిలలాడుతున్నాయని, రాష్ట్ర మంతటా బీఆర్ఎస్ ప్రభంజనం కనబడుతుందని తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ (Koleti Damodar) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలతో లబ్ది పొందుతున్న వారు రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పథకాలన్నీ ఆగిపోయే ప్రమాదముందనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) అమలు చేసిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ మానిఫెస్టోలోని అంశాలు ఆయుధాలని పేర్కొన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలతో పాటు మరికొన్ని కొత్త పథకాలు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని వెల్లడించారు. ఉచిత కరెంట్, ఇరిగేషన్ పనుల విషయంలోనూ, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ కేసీఆర్ తర రాష్ట్ర ప్రభుత్వ్లా కంటే ముందు వరుసలో ఉండడంతో ప్రజల్లో సానుకూలత పెరిగిందన్నారు.
బీఆర్ఎస్కు హ్యాట్రిక్(Hatrick,) విజయాన్ని అందించాలన్న నిర్ణయం ఓటర్లలో స్పష్టంగా ఆయన తెలిపారు. బీఆర్ఎస్కు పోటీనిచ్చే అభ్యర్థులే లేరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం నిజామాబాద్లో నిర్వహించిన బీజేపీ సభ అనంతరం కూడా ఆ పార్టీలో ఉత్సాహమేలేదని అన్నారు. మోదీ, రాహుల్ గాంధీ సభలకు జనాలు రాలేదని అన్నారు.