HMDA | హైదరాబాద్ : కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. నియో పోలిస్ భూములు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. ఎకరం భూమికి కనీస ధర రూ. 35 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. వేలంలో మాత్రం అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు, అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి.
నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. తాజాగా నిర్వహించిన వేలంతో.. ఇప్పటి వరకు కోకాపేట నియో పోలిస్లో 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది.
గురువారం మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 18.47 ఎకరాలకు వేలం కొనసాగుతోంది. ప్రస్తుతం నియో పోలిస్లో 10, 11, 14 ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ఈ ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.