రాజన్న సిరిసిల్ల: కరోనా తీవ్రత దృష్ట్యా వేములవాడ రాజన్న ఆలయం ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజన్న ఆలయంలో కొద్ది రోజుల పాటు కోడె మొక్కులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో కోడె మొక్కులు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తున్న క్రమంలో ఇప్పటికే పలు ఆలయాల్లో దర్శనాలను నిలిపివేశారు.