బాల్కొండ, మార్చి 14 : నిజామాబాద్ జిల్లా లో దారి దోపిడీ ఘటన కలకలం రేపింది. డ్రైవర్ను తుపాకీతో బెదిరించి కంటైనర్లోని సరుకును లూటీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్ర ముఖ కంపెనీకి చెందిన తినుబండారాల ప్యాకెట్లతో కంటైనర్ సోమవారం రాత్రి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు బయల్దేరింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వద్దకు రాగానే కారులో వచ్చిన దుండగులు కంటైనర్ను అడ్డగించారు. తుపాకీతో బెదిరించి డ్రైవర్ ప్రఫుల్ కండ్లకు గంతలు కట్టి వాహనంలో ఉన్న సుమారు రూ.4 లక్షలు విలువ చేసే సరుకును ఖాళీ చేశారు.
అనంతరం అతడిని కారు లో ఎక్కించుకొని, కంటైనర్ వాహనాన్ని ముఠాలోని సభ్యుడు నడుపుతూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడకు రాగానే కంటైనర్ డ్రైవర్ ప్రఫుల్పై కత్తితో దాడి చేసి, వాహనాన్ని వదిలేసి కారులో ప రారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఉదయం అక్కడకు చేరుకొని ప్రఫుల్ను చికిత్స నిమిత్తం ఆర్మూర్ దవాఖానకు తరలించారు. దొంగల ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్టు డ్రైవర్ తెలిపాడని ఎస్సై గోపి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.