మాదాపూర్, జనవరి 2: ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలో ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణులపై చర్చించేందుకు కొండాపూర్లోని కేఎల్హెచ్ క్యాంపస్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పార్థసారధివర్మ మంగళవారం తమ అధ్యాపక బృందంతో కలిసి ఈ సదస్సును ప్రారంభించారు.
అనంతరం ‘థింక్ ఏఐ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేఎల్హెచ్ అజీజ్నగర్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణ, కన్వీనర్ డాక్టర్ సందీప్, బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిపల్, డాక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.