మాదాపూర్, జనవరి 30: కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంలో భాగంగా వ్యవసాయం, బయో రిఫైనరీకి సంబంధించి కృత్రిమ మేధస్సు(ఏఐ)లో అత్యాధునిక పరిశోధనలు చేయనున్నారు. వ్యవసాయ రంగంలోని సవాళ్లను చక్కబెట్టేందుకు, స్థిరమైన భవిష్యత్తు కొరకు వినూత్న పరిష్కారాలను అన్వేషించడానికి రెండు ప్రముఖ సంస్థలను ఒకేచోట చేర్చినట్టు కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు లక్ష్మణ్ హవివ్ తెలిపారు.