హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ కైట్ ఫెస్టివల్లో 16 దేశాల నుంచి 40 మంది కైట్ ప్లేయర్స్ పాల్గొననున్నారు. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించే ఈ కైట్ ఫెస్టివల్లో 15 వరకు గాలిపటాలను ఎగురవేస్తారు.
ఈసారి ప్రత్యేకంగా రాత్రివేళ పతంగులు ఎగురవేసేలా ప్రణాళికలు రచించారు.