నారాయణపేట టౌన్, ఏప్రిల్ 24: మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కృషి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్ అన్నారు. పట్టణంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 25న ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించుటకు బ్యానర్, వాల్పోస్టర్లు, బ్యాడ్జీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికన్గున్యా, మెదడువాపు, ఫైలేరియా తదితర వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించుట కోసం దోమల నివారణ చర్యలు, వ్యాధుల నియంత్రణ చర్యలపై ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎన్వీబీడీసీపీ పీవో డాక్టర్ సిద్ధ్దప్ప మాట్లాడుతూ డబ్ల్యూహెచ్వో పిలుపు మేరకు 2030 నాటికి మలేరియా నిర్మూలనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ శైలజ, మాస్మీడియా అధికారి హన్మంతు, అశోక్కుమార్, అరవింద్కుమార్, అహ్మద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.