నర్సంపేట : కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కి నిధులు తేకుండా మంత్రి కిషన్రెడ్డి (Kisan Reddy) అసమర్థుడిగా మిగిలిపోతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి( MLA Peddi Sudarshan Reddy’) ఆరోపించారు. కేంద్ర మంత్రి చేతగాని తనం తెలంగాణ(Telangana)కు శాపంగా మారిందని ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఆయన బహిరంగ లేఖను రాశారు.
‘ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంత బిడ్డగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీ బాధ్యతలను మరిచి అడ్డగోలు విమర్శలకే పరిమితమయ్యారు. ఏనాడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయలేద’ ని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయినట్లుగానే కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేక పోతున్నారని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తుంటే పట్టించుకోకుండా రాజకీయాలు(Politics) చేస్తున్నారని విమర్శించారు.
వరదల సమయంలో రూ.1000 కోట్ల సహాయాన్ని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.‘ హైదరాబాద్లో భారీ వర్షాలతో వరదలొస్తే బండి పోతే బండి ఇస్తాం అంటూ డంబాచారాలు పలికారు. అర్ధ రూపాయి కూడా సాయం చేయలేకపోయారని ఆరోపించారు. వరంగల్(Warangal) జిల్లాలో గతేడాది జనవరిలో వడగండ్ల వాన సృష్టించిన విధ్వంసానికి రైతులు తీవ్రంగా నష్టపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ఫుట్ సబ్సిడీని అందించి రైతులను ఆదుకున్నారని స్పష్టం చేశారు.
బీజేపీ పాలిత ఎన్నికలు ఉన్న ఐదు రాష్ట్రాలకు రూ.1,816.16 కోట్లు ఇచ్చిన కేంద్రం ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతున్నదని , కేంద్ర వికృత రాజకీయ క్రీడలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.