హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఇది కరోనా కాలం.. పౌష్ఠికాహారం మాత్రమే తినండని ప్రభుత్వాల దగ్గరి నుం చి డాక్టర్ల వరకు అందరూ చెప్తున్నారు. దాత లు కూడా వీలైనంత వరకు బాధితులకు పం డ్లు, పోషకాహారాన్నే అందజేస్తున్నారు. ఈ సమయంలో కుర్కురే, డోరిటోస్ ప్యాకెట్ల పంపిణీని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఇదే ఆయన్ను నెటిజన్ల చేతుల్లో ట్రోల్ అయ్యేలా చేసింది. ఢిల్లీ బీజేపీ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు, కరోనా డ్యూటీ చేస్తున్న పోలీసులు, పారిశుధ్య కార్మికులకు స్నాక్స్ ప్యాకెట్లు పంచాలని నిర్ణయించారు. ఈ ప్యాకెట్ల పంపిణీని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్గుప్తా ట్విట్టర్లో షేర్ చేశారు. అంతే.. పౌష్ఠికాహారం బదులు కుర్కురే ప్యాకెట్లు పంపిణీ చేస్తారా? అని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేయటం ప్రారంభించారు. అసలు కుర్కురే ప్యాకెట్లు పంచటం ఏంటి? అవి ఏ విధంగా పౌష్టికాహారం అవుతాయని తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు.