హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి గాడిదగుడ్డు ఇస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మారును రేవంత్రెడ్డి చూపిస్తున్నారని ఆరోపించారు.
శుక్రవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పెండింగ్ నియామకాలకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి, 28,942 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఎద్దేవాచేశారు.