హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు చందును దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ముగ్గురిని అపహరించి రూ.2 కోట్లకుపైగా నగదును కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్టు సమాచారం.
గురువారం ఉదయం 8 గంటలకు ఎంపీ ఎంవీవీ ఫోన్తో సమాచారం అందుకొన్న పోలీసు బృందాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి, కేసు విచారణను ముమ్మరం చేశారు. అయితే కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసును పోలీసులు చేధించారు. నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ హేమంత్ కుమార్గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై ఒక హత్య కేసు సహా 12 కిడ్నాప్ కేసులు ఉన్నాయి. మొత్తం మీద డబ్బు కోసమే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.