ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల నియోజక వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి తాత మధు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర్ రావు, జెడ్పీ చైర్మన్స్ లింగాల కమల్ రాజు, కోరం కనకయ్య పాల్గొన్నారు.
కాగా, ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రకటన వెలువడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తున్నది. ఆరు స్థానాలకు బరిలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.