హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): 17వ లోక్సభకు తెలంగాణ నుంచి అత్యధికంగా హాజరైన వారిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావుకు టాప్లో ఉన్నారు. మొత్తం 273 రోజులకుగాను 241 రోజులు (శాతం 88.3) ఆయన సభకు హాజరై.. వివిధ సమస్యలపై 202 ప్రశ్నలు అడిగారు.
నామా తర్వాత ఎక్కువ రోజులు హాజరైనవారిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఉన్నారు. ఈయన 240 రోజులు హాజరై.. 78 ప్రశ్నలు మాత్రమే అడిగారు. తెలంగాణ నుంచి అత్యధికంగా ప్రశ్నలు అడిగిన బీఆర్ఎస్ లోక్సభ సభ్యుల్లో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ఉన్నారు. ఆయన 194 రోజుల్లో 345 ప్రశ్నలు అడిగారు.