హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కేజీబీవీల్లో ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలను గురువారం సమగ్ర శిక్ష అధికారులు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. శుక్రవారం డీఈవో ఆఫీసుల్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
మెరిట్ జాబితా నుంచి ఖాళీలకు అనుగుణం గా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెరిఫికేషన్ అనంతరం ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్కు ఫోన్ చేసి, ఎంపికైన విషయం అభ్యర్థులకు తెలియజేయనున్నారు.