హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వివేకా రాసిన లేఖకు నిన్హైడ్రిన్ పరీక్షకు అనుమతిస్తూ సీబీఐ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. హత్యాస్థలిలో దొరికిన లేఖను సీబీఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్కు పంపగా, ఒత్తిడిలోనే వివేకా లేఖ రాసినట్టు తేలింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉన్నదన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. లేఖ పరీక్షకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేయగా, బుధవారం అనుమతిచ్చింది.