మేడ్చల్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జవహర్నగర్కు చెందిన మాజీ వార్డు సభ్యురాలు కేతమ్మ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసింది. ఏమన్నారో ఆమె మాటల్లోనే.. ‘సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను తిట్టె పుడింగులా.. రేవంత్రెడ్డి, బండి సంజయ్లు గడ్డిపోసను కూడ పికరు. వీళ్లతోని కట్టె ఇరగదు. పాము సావదు. పెద్ద పెద్ద లీడర్లు అంటరు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ చేసింది ఏమి లేదు. యమ ధర్మారాజుతో కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చి తీర్చిదిద్దిండు. తెలంగాణ రాక ముందు రేకుల గుడిసెలో ఉన్నాం. తెలంగాణ వచ్చినంక ఇండ్లు కట్టుకున్నం. కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ లేక పంటలు ఎండిపోయినయి. కాలిపోయిన మోటర్లు పెలిపోయిన స్టాటర్లు కనపడేవి. ఇప్పుడు ఎటు చూసిన గంగే. పచ్చని పొలాలు కనిపిస్తున్నయి. 24 గంటలు కరెంటు వస్తుంది. ఎండ కాలం వచ్చిందంటే నీళ్ల కోసం కోట్లడినం. ఇప్పుడు ఇంటింటికి భగీరథ నీళ్లు అస్తున్నాయి.
హోలీ నాడు ఆడోళ్లు, మొగోళ్లు పైపు పట్టుకుని ఇంట్లో స్నానం చేస్తున్నరు. ఇందంతా కేసీఆర్ ఘనత కాదా. కేసీఆర్ను, కేటీఆర్ను రారా పోరా అంటున్నరు. ఛీ మీరేం పీకారు. ఐకమత్యమే మా బలం. మేం కేసీఆర్ బిడ్డలం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మట్టిలో కొట్టుకపోతాయి. మళ్ల అధికారంలోకి వచ్చేంది బీఆర్ఎస్ పార్టే. ఎవరి మీదనో మంత్రి మల్లన్న కేసు పెట్టిండంట. కేసు పెట్టడానికి మంత్రి మల్లన్నకు ఏమి పట్టింది. మా మంత్రి మల్లన్నను ఏదో చేయాలని చూస్తున్నారు. మేమందరం మల్లన్న కోసం పాణం ఇస్తాం. కేతమ్మ ప్రసంగిస్తున్న సమయంలో చప్పట్లు మార్మోగాయి.