కేరళ ఆర్థికశాఖ మంత్రి కే బాలగోపాల్
ఎంఎస్పీ కోసం పోరాటం: అశోక్ దావరే
చిక్కడపల్లి, జనవరి 10: నిధులు కేటాయింపులో రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని కేరళ ఆర్థికమంత్రి కే బాలగోపాల్ అన్నారు. ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బాలగోపాల్ మాట్లాడుతూ.. కేంద్ర విధానాల ఫలితంగా వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని అన్నారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ దావలే మాట్లాడుతూ కనీస మద్దతు ధరల చట్టం లక్ష్యసాధన కోసం ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి హన్నన్మొల్లా, జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, జాతీయ సహాయ కార్యదర్శి విజ్జుకృష్ణన్, కృష్ణప్రసాద్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి టీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.