KCR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఎస్పారెస్పీ ఆయకట్టు కింద ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడువెల్లబోసుకోగా.. కేసీఆర్ వారికి భరోసానిచ్చారు.
పలువురు రైతులు కేసీఆర్తో మాట్లాడుతూ ‘మీరు ఉన్నప్పుడే మంచిగుండె సార్. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మోటార్లు కాలిపోతున్నయ్. సుక్క నీళ్లు వస్తలేవు’ అంటూ కేసీఆర్తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కేసీఆర్ కొట్లాడుదాం.. పోరాటం చేస్దామంటూ రైతుల్లో ధైర్యం చెప్పారు. అంతకు ముందు కేసీఆర్ జనగామ జిల్లా ధరావత్తండాలో పర్యటించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.