Haritha Haram | హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని పచ్చగా మార్చిన ‘హరితహారం’ పథకం పేరును మార్చేందుకు రేవంత్రెడ్డి సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టిన ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని అదే పేరుతో కొనసాగిస్తే అధికార కాంగ్రెస్కు ఒరిగేది ఏమీ ఉండదని, అందుకే ఆ పథకం పేరును మార్చాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. దీంతో ఇకపై ఈ పథకాన్ని ఏ పేరుతో అమలు చేస్తారన్న దానిపై ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర అటవీ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై త్వరలో జరుగనున్న సమావేశంలో కొత్త పేరుపై స్పష్టత రావచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో అటవీ శాఖకు రూ.445 కోట్లు కేటాయించడంతోపాటు వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన, గాయపడిన, పశువులను కోల్పోయినవారికి పరిహారం చెల్లించేందుకు రూ.2 కోట్లు సమకూర్చాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు.
గతేడాది వివిధ పనులకు రూ.145 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర అటవీ శాఖ.. ప్లాంటేషన్ డ్రైవ్తోపాటు హరితహారం కార్యక్రమానికి మొకలను సరఫరా చేసేందుకు పలు ప్రాంతాల్లో నర్సరీలను పెంచుతున్నది. ఈ ఏడాది జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొకలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది.