KTR | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 19( నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్.. అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సిరిసిల్లలోని కే కన్వెన్షన్లో జరిగిన బీఆర్ఎస్ నేత కత్తెర వరుణ్ కుమార్ కూతురు వస్త్రాలంకరణ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అక్కడే కత్తెర దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్ దంపతులు ఘనంగా స్వాగతంగా పలికారు. కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.