హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ను అతి త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. మంగళవారం నీరా కేఫ్ ప్రారంభం, నీరా ఉత్పత్తి, సేకరణ, మారెటింగ్, నీరా చిల్లింగ్ కేంద్రాల నిర్మాణ పనులు ఇతర అంశాలపై అబారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి సమీక్షించారు. సర్వేల్, చారుకొండ, మునిపల్లెల్లో నిర్మిస్తున్న నీరాచిల్లింగ్ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు.
గీత కార్మికులు తాటి, ఈత చెట్లపై నుంచి ప్రమాదవశాత్తు పడి శాశ్వత అంగవైకల్యం పొందితే ప్రభుత్వ దవాఖాన నుంచి ముగ్గురు డాక్టర్లకు బదులుగా ఆర్థోపెడిక్ అసిస్టెంట్ సర్జన్ చికిత్స ఇచ్చేలా నిబంధనలు సవరించాలన్నారు. రైతుబీమా మాదిరిగా సాధారణ మరణం సంభవించిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇచ్చేలా ప్రణాళికను రూపొందించాలని సూచించారు. సీఎం కేసీఆర్ అదేశాల మేరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా పాలసీని ప్రవేశపెట్టినట్టు మంత్రి తెలిపారు. సుమారు రూ.20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్ను సీఎం కేసీఆర్చే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గీత కార్మికులకు మోపెడ్ వాహనాల పంపిణీ పై సీఎంతో చర్చిస్తామన్నారు. సమీక్షలో ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు అజయ్రా వు, డేవిడ్ రవికాంత్, దత్తరాజ్ గౌడ్ తదితరులున్నారు.