నాకు బుద్ధి తెలిసిన కాన్నుంచి చూస్తున్న. ఎన్నో ప్రభుత్వాలు అచ్చినయి పోయినయిగాని మా రైతులను ఎవలూ పట్టించుకోలే. ఓటర్లుగా చూశారే తప్ప ఎవరూ ఏం చేయలే. కానీ కేసీఆర్ ఒక్కడే ఆదుకున్నడు. రైతు కోసమే పనిచేస్తండు. కరెంట్ ఇబ్బందులు తీర్చిండు. బీమా ఇస్తండు. పెట్టుబడులకు పైసలు కూడా ఇస్తండు. ఇంకెంగావాలే. ఇయ్యాళ ఎవుసం బంగారమైందంటే అది కేసీఆర్తోనే అయింది. తెలంగాణ రాకపోయినా.. కేసీఆర్ సీఎం కాకపోయినా రైతుల బతుకులు మారకపోతుండే.
-జక్కుల ఓదెలు, రైతు, ధర్మరాజుపల్లి(హుజూరాబాద్)
గెలిసినా ఏం చేయడు..
నా ఓటు కేసీఆర్కే ఏత్త. నాకు టీఆర్ఎస్ మీద నమ్మకం ఉన్నది. చెప్పినయన్నీ చేస్తున్నరు. నాకు గొర్లు అచ్చినయ్.. భూమి పైసలు ఏటా రెండుసార్ల పడుతున్నయ్.. మాకు ఏ రందీ లేకుండా చేసిండు. నేనైతే కారుకే ఓటేస్త. జనం కూడా కేసీఆర్కే ఎయ్యాలంటున్రు. ఈటల రాజేందర్ ఈడ గెలిసినా మనకేం చేయడు. పనులు చేసేటోళ్లకే ఓటు వేస్తే మంచిగుంటది. ఏ పని కావాలన్నా చెప్పుకుంటే అయితది.