మంథని, డిసెంబర్ 5: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చూస్తున్న పుట్ట మధుకర్ ఆలోచనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరమింపజేశారు. జడ్పీచైర్మన్గా పుట్ట మధు, మంథని మున్సిపల్ చైర్పర్సన్ శైలజ మంథనిలో బీఆర్ఎస్ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి విషయాన్ని వివరించారు. కేసీఆర్ స్పందిస్తూ.. ఓటమి ఒక్క మంథని నియోజకవర్గం లో లేదా పెద్దపల్లి జిల్లాలో జరిగిన అంశ ం కాదని తెలిపారు. ఇలాంటి నిర్ణయా లు తీసుకోవద్దని సూచించారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించాలని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను అమలు చేసేలా పోరాడాలని, ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి జిల్లా కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని పుట్ట మధుకు సూచించారు.