హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): సత్యాన్వేషణ ద్వారానే మానవ జీవితానికి అర్థవంతమైన దారి దొరుకుతుందని జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు ప్రబోధించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అరిషడ్వర్గాలను జయించడం ద్వారా నే వర్ధమానుడు మహావీరుడిగా కీర్తిని ఆర్జించాడని తెలిపారు. వర్ధమాన మహావీరుని జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన శాంతియుత పోరాటపంథాలో వర్థమానుని బోధనలు, ఆయన అనుసరించిన అహింసా మార్గం ఇమిడి ఉన్నాయని వెల్లడించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వర్థమానుని స్ఫూర్తితో, ఓర్పు, సహనంతో తెలంగాణ తన భవిష్యత్తు విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని స్పష్టంచేశారు.